ఒలింపిక్స్‌: భారత్‌ నేడు పాల్గొనే ఈవెంట్లు ఇవే

ఒలింపిక్స్‌లో భారత్‌ నేడు పలు ఈవెంట్లలో పాల్గొననున్నది.

By :  Raju
Update: 2024-07-27 04:50 GMT

ఒలింపిక్స్‌లో భారత్‌ నేడు పలు ఈవెంట్లలో పాల్గొననున్నది. రోయింగ్‌ విభాగంలో మధ్యాహ్నం 12.30 గంటలకు పురుషుల సింగిల్‌ స్కల్స్‌ హీట్స్‌లో బాల్‌రాజ్‌ పన్వర్‌ పాల్గొననున్నారు. షూటింగ్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ క్వాలిఫికేషన్‌ పోటీలో భారత్‌ తరఫున 4 జంటలు పాల్గొననున్నాయి.

టెన్నిస్‌లో పురుషుల డబుల్స్‌ మొదటి రౌండ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు జరగనున్నది. బోపన్న-బాలాజీ జంట తొలి రౌండ్‌లో పాల్గొననున్నారు. రాత్రి 7.10 గంటలకుజరిగే బ్మాడ్మింటన్‌లో పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, రాత్రి 8 గంటలకు పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌, రాత్రి 11.50 గంటలకు మహిళల డబుల్స్‌ అశ్విని-తనీషా పోటీ పడనున్నారు.

రాత్రి 9 గంటలకు భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య హాకీ మ్యాచ్‌ జరగనున్నది. రాత్రి 12 గంటలకు మహిళల బాక్సింగ్‌

54 కిలోల విభాగంలో తొలి రౌండ్‌లో ప్రీతి పోటీ పడుతున్నారు. టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ ప్రిలిమినరీ రౌండ్‌లో హర్మీత్‌ దేశాయ్‌ పోటీ పడనున్నారు. 

Tags:    

Similar News