ఒలింపిక్స్: భారత్ నేడు పాల్గొనే ఈవెంట్లు ఇవే
ఒలింపిక్స్లో భారత్ నేడు పలు ఈవెంట్లలో పాల్గొననున్నది.
ఒలింపిక్స్లో భారత్ నేడు పలు ఈవెంట్లలో పాల్గొననున్నది. రోయింగ్ విభాగంలో మధ్యాహ్నం 12.30 గంటలకు పురుషుల సింగిల్ స్కల్స్ హీట్స్లో బాల్రాజ్ పన్వర్ పాల్గొననున్నారు. షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ క్వాలిఫికేషన్ పోటీలో భారత్ తరఫున 4 జంటలు పాల్గొననున్నాయి.
టెన్నిస్లో పురుషుల డబుల్స్ మొదటి రౌండ్ మధ్యాహ్నం 3.30 గంటలకు జరగనున్నది. బోపన్న-బాలాజీ జంట తొలి రౌండ్లో పాల్గొననున్నారు. రాత్రి 7.10 గంటలకుజరిగే బ్మాడ్మింటన్లో పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్, రాత్రి 8 గంటలకు పురుషుల డబుల్స్లో సాత్విక్-చిరాగ్, రాత్రి 11.50 గంటలకు మహిళల డబుల్స్ అశ్విని-తనీషా పోటీ పడనున్నారు.
రాత్రి 9 గంటలకు భారత్-న్యూజిలాండ్ మధ్య హాకీ మ్యాచ్ జరగనున్నది. రాత్రి 12 గంటలకు మహిళల బాక్సింగ్
54 కిలోల విభాగంలో తొలి రౌండ్లో ప్రీతి పోటీ పడుతున్నారు. టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ప్రిలిమినరీ రౌండ్లో హర్మీత్ దేశాయ్ పోటీ పడనున్నారు.