పారా ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత దీప్తికి రూ.కోటి

గ్రూప్‌ -2 ఉద్యోగం, 500 గజాల ఇంటి స్థలం.. కోచ్‌ నాగపురి రమేశ్‌ కు రూ.10 లక్షల క్యాష్‌ ప్రైజ్‌.. ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Update: 2024-09-07 14:01 GMT

పారా ఒలింపిక్స్‌ లో కాంస్య పతాకం సాధించిన తెలంగాణ బిడ్డ దీప్తి జీవన్‌ కు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి క్యాష్‌ ప్రైజ్‌ ప్రకటించింది. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ లోని నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డిని దీప్తి తన కుటుంబ సభ్యులతో కలిశారు. క్యాష్‌ ప్రైజ్‌ తో పాటు 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్‌ -2 ఉద్యోగం ఇస్తామని సీఎం ప్రకటించారు. దీప్తి కోచ్‌, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్‌ కు రూ.10 లక్షల నగదు పురస్కారం ప్రకటించారు. పారా ఒలింపిక్స్‌ లో ఆమె పతకం సాధించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్‌, షాట్స్‌ చైర్మన్‌ కె. శివసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News