ఒలింపిక్స్ : షూటింగ్లో ఫైనల్కు మను బాకర్
పారిస్ ఒలింపిక్స్ మహిళల షూటింగ్ విభాగంలో మను బాకర్ పైనల్ చేరింది.
పారిస్ ఒలింపిక్స్ మహిళల షూటింగ్ విభాగంలో మను బాకర్ పైనల్ చేరింది. 10 మీటర్ల షూటింగ్ విభాగంలో క్వాలిఫికేషన్ రౌండ్లో 580.27 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఆమె ఫైనల్కు అర్హత సాధించింది. ఎయిర్ పిస్టల్ విభాగంలో 20 ఏళ్ల తర్వాత ఓ మహిళా షూటర్ ఫైనల్కు చేరడం ఇదే మొదటిసారి. చివరగా 2004లో సుమా శిరూర్ ఫైనల్ చేరింది.
హంగేరి క్రీడాకారిణి వెరొనికా 582.22 మొదటి స్థానంలో నిలిచింది. మరో మహిళా క్రీడాకారిణి రిథమ్ సంగ్వాన్ 15 వ స్థానంతోనే సరిపెట్టుకున్నది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోరు జరగనున్నది. అటు పురుషుల విభాగంలో సరబ్ జోత్ సింగ్, అర్జున్ చీమా టాప్ 8లో చోటు దక్కించుకోకపోవడంతో ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు.
మిక్స్డ్ టీమ్ విభాగంలో వలరివన్ -సందీప్ సింగ్ జోడి 626. 3 పాయింట్లతో 12వ స్థానంలో, రమిత-అర్జున్ బబుతా జోడీ 628.7 స్కోర్తో ఆరో స్థానంలో నిలిచారు.