లంకతో రెండో వన్డేలో భారత్ ఓటమి
మూడు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. శ్రీలంక నిర్దేశించిన 241 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (64) హాఫ్ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. అక్షర్ పటేల్ (44), శుభ్మన్ గిల్ (35) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో టీమిండియా 42.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌట్ అయ్యింది.లంక బౌలర్లలో వాండర్సే 6 వికెట్లు పడగొట్టగా.. చరిత్ అసలంక 3 వికెట్లు తీశాడు.
అంతకు ముందు శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. శ్రీలంక బ్యాటర్లలో ఫెర్నాండో (40), కుశాల్ మెండిస్ (30), దునిత్ (39), చరిత్ అసలంక (25), సమరవిక్రమ (14), కమిందు (40), ధనంజయ్ (15 నాటౌట్) సమిష్టిగా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ 3 వికెట్లు తీయగా.. కుల్దీప్ 2, అక్షర్, సిరాజ్ చెరో వికెట్ తీశారు.