వైసీపీ నేత పిన్నెల్లికి బెయిల్ మంజూరు

వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజురు చేసింది.

By :  Vamshi
Update: 2024-08-23 10:29 GMT

వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజురు చేసింది.రూ. 50 వేల విలువైన రెండు పూచికత్తులను సమర్పించాలని, పాస్ పోర్టును అప్పగించాలని, ప్రతి వారం పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు.

హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. పిన్నెల్లి విడుదలవుతున్న నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచారు. జైలు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో ఈవీఎంను ధ్వంసం చేసిన విషయంలో పిన్నెళ్లి కేసు నమోదైన విషయం తెలిసిందే.

Tags:    

Similar News