టీడీడీ బోర్డు తరహాలో యాద్రాది టెంపుల్ బోర్డు : సీఎం రేవంత్‌

యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డికీలక ఆదేశాలిచ్చారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

By :  Vamshi
Update: 2024-08-30 11:54 GMT

యాదగిరిగుట్ట టెంపుల్ అభివృద్ధిపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. టీడీటీ బోర్డు తరహాలో యాద్రాది దేవాలయం బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. యాదాద్రి గుడి అభివృద్ధి పనులపై సీఎం శుక్రవారం సచివాలయంలో రివ్యూ చేశారు.

యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని సీఎం అధికారులను కోరారు. భక్తుల సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైన వివరాలు అందించాలని ఆదేశించారు. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధంతరంగా వదిలేయడానికి వీళ్లేదని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు.

Tags:    

Similar News