యూఏఈలో మహిళా టీ20 ప్రపంచకప్‌

మహిళల టీ20 ప్రపంచకప్‌ యూఏఈ వేదికగా జరగనున్నట్లు ఐసీసీ తెలిపింది. దుబాయ్, షార్జా వేదికలుగా అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు మహిళల టీ20 ప్రపంచకప్‌ జరగనుంది.

By :  Vamshi
Update: 2024-08-20 15:51 GMT

మహిళల టీ20 ప్రపంచకప్‌ యూఏఈ వేదికగా జరగనున్నట్లు ఐసీసీ తెలిపింది. దుబాయ్, షార్జా వేదికలుగా అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు మహిళల టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. వారం రోజుల ముందుగానే సెప్టెంబర్‌ 27నుంచి వార్మప్‌ మ్యాచ్‌లు మొదలవుతాయి. నిజానికి బంగ్లాదేశ్‌లో టోర్నీ నిర్వహించాల్సి ఉండగా.. అక్కడ నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో వేదికను యూఏఈకి మారుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.ఇదివరకే అక్కడ పురుషుల టీ20 ప్రపంచకప్‌ నిర్వహించిన అనుభవం ఉండటంతో ఐసీసీ కూడా యూఏఈ వైపునకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News