కేటీఆర్కు మహిళా కమిషన్ నోటీసులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది.ఈ నెల 24న కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొన్నాది.
By : Vamshi
Update: 2024-08-16 11:18 GMT
తెలంగాణ మహిళ కమీషన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది.ఈ నెల 24న కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొన్నాది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. దీనిపై ఎక్స్లో పోస్ట్ చేశారు. 'పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను ..నా అక్కాచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు. అని కేటీఆర్ తెలిపిన సంగతి తెలిసిందే