మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో పనిచేస్తాం: సీఎం రేవంత్
తమ ప్రభుత్వంలో సర్వమతాలకు ప్రాధాన్యంమాన ఇస్తామన్నారు. అన్ని మతాలకు చెందిన భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడం మా ప్రభుత్వ బాధ్యత అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అందరిదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో సీఎం పాల్గొన్నారు. జగన్నాథ స్వామికి సీఎం హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ అనిల్కుమార్ యాదవ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో సర్వమతాలకు ప్రాధాన్యంమాన ఇస్తామన్నారు. అన్ని మతాలకు చెందిన భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడం మా ప్రభుత్వ బాధ్యత అన్నారు. రాష్ట్రం శాంతి సౌఖ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఈ యాత్ర ద్వారా భగవంతుడిని కోరుకుంటున్నాని తెలిపారు.
మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో మా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజంలో మార్పు వస్తుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.