పంద్రాగస్ట్‌లోగా రుణమాఫీ చేసి తీరుతాం : రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ అన్నారు

By :  Vamshi
Update: 2024-07-09 14:20 GMT

త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్‌లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో సీఎం మాట్లాడుతూ..కాంగ్రెస్ కార్యకర్తల కోసం నాయకులు పని చేయాలని.. కార్యకర్తల్ని సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా గెలిపించాలని  పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు నామినేటేడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ గెలుపుకు కృషి చేసిన కార్యకర్తల్నే కుర్చీలో కూర్చొబెట్టాలనే నేతలకు చెప్తున్నానని.. నాకు వచ్చిన సీఎం పదవి కార్యకర్తల కష్టం, త్యాగాల ఫలితమేన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే... కూలిపోతుందని కేసీఆర్ అనలేదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలను హింసించారని... దాడులు జరిగిన సమయంలో కేసీఆర్ చెబుతున్న రాజనీతి ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. తన వరకు వస్తే గానీ కేసీఆర్‌కు బాధ తెలియడం లేదన్నారు. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు చెప్పారు. సంవత్సరం లోపే మన ప్రభుత్వం ఎన్నో పనులు చేస్తుంటే... బీఆర్ఎస్ మాత్రం కుట్రలు చేస్తోందన్నారు.

Tags:    

Similar News