విద్యార్థులకు నష్టం చేసే జీవో 33పై పోరాటం చేస్తాం: హరీశ్‌

తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం చేసే జీవో 33 పై పోరాటం చేస్తామని హరీశ్‌ వాళ్లకు హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా న్యాయ పోరాటానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు.

By :  Raju
Update: 2024-08-08 07:41 GMT

ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. ప్రభుత్వ అనాలోచితంగా తెచ్చిన జీవో వల్ల తమ పిల్లలు వైద్య విద్య చదివే అవకాశాలు కొల్పోతున్నట్లు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల నిబంధన వల్ల తెలంగాణలో పుట్టిన పిల్లలు స్వరాష్ట్రంలోనే నాన్ లోకల్ కావడం బాధగా ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల స్వరాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు ఎంబీబీఎస్, బీడీఎస్ చదివే అవకాశం కోల్పోతున్నారని మండిపడ్డారు. దీనిపై తెలంగాణ పిల్లలకు న్యాయం న్యాయం జరిగేలా చూడాలని, ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని హరీశ్‌ రావును కోరారు.

తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం చేసే జీవో 33 పై పోరాటం చేస్తామని హరీశ్‌ వాళ్లకు హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా న్యాయ పోరాటానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. కాబట్టి తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని, ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మన పిల్లలకు అడ్మిషన్ల కోసం స్థానికతను నిర్ధారించుకోడానికి కొత్త సమగ్ర విధానం రూపొందించాలన్నారు. చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో ఒక హై లెవెల్ కమిటీ వేసి తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్స్ విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News