తెలంగాణ ద్రోహులను వదలం: ఆర్‌ఎస్‌పీ

కేసీఆర్‌ను నమ్మి నేడు బీఆర్‌ఎస్‌లో చేరిన కాగజ్ నగర్ ఉక్కు మహిళలకు పాదాభివందనాలు. మీ త్యాగాన్ని వృథాగా పోనివ్వం. తెలంగాణ ద్రోహులను వదలమని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

By :  Raju
Update: 2024-07-14 07:33 GMT

బీఆర్‌ఎస్‌ హయంలో అన్ని పదవులు అనుభవించి అధికారం పోగానే పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తీవ్రంగా మండిపడ్డారు. అలాంటి స్వార్థపరులు పార్టీకి ద్రోహం వీడినా తెలంగాణను రక్షించే దమ్మున్న నాయకుడు కేసీఆరే అన్నారు. కాగజ్‌ నగర్‌లో బీఆర్‌ఎస్‌ లో చేరిన మహిళలకు, ఇతరులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు. 'ఎంతో మంది స్వార్థపరులు తెలంగాణ ఉద్యమ ఫలాలను పీకల దాకా మెక్కి, తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి పారిపోతున్నారు. ఈ సమయంలో తెలంగాణను రక్షించి ముందుకు పరిగెత్తించే దమ్మున్న ఏకైక నాయకుడు కేసీఆరే. ఆయనను నమ్మి నేడు బీఆర్‌ఎస్‌లో చేరిన కాగజ్ నగర్ ఉక్కు మహిళలకు పాదాభివందనాలు. మీ త్యాగాన్ని వృథాగా పోనివ్వం. తెలంగాణ ద్రోహులను వదలం. జై తెలంగాణ. జై భారత్. అని రాసుకొచ్చారు. 

Tags:    

Similar News