ఏపీలో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : అశ్వినీ వైష్ణవ్
ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్రం కట్టుబడి ఉన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. లోక్సభలో ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై ఎంపీలు కేశినేని చిన్ని, సీఎం రమేశ్ ప్రశ్నలు అడిగారు.
ఏపీలో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. లోక్ సభలో ఏపీ రైల్వే ప్రాజెక్టులపై ఎంపీలు కేశినేని చిన్ని, సీఎం రమేశ్ ప్రశ్నలు అడిగారు. ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైన రాష్ట్రమని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతంతో పోల్చితే కేటాయింపులు పెంచామని వెల్లడించారు. 2023-24 ఏడాదికి ఏపీకి రూ.8,406 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు.
అమరావతి, విజయవాడ రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. విజయవాడ స్టేషన్ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అప్గ్రేడ్ చేస్తామన్నారు. అనకాపల్లి స్టేషన్ గురించి వివరాలు నివేదిక రూపంలో ఇస్తానని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.