నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా.. సీఎం స్టాలిన్ కామెంట్స్

బడ్జెట్‌లో తమిళనాడు ప్రజలకు అన్యాయంపై నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తామని తమిళనాడు సీఎం ఎంకేస్టాలిన్ అన్నారు.

By :  Vamshi
Update: 2024-07-23 14:39 GMT

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ పెదవి విరిచారు. ప్రధాని మోదీ మూడోసారి అధికారం చేపట్టనప్పటికీ ప్రజల కోసం బీజేపీ ఆలోచించలేదని విమర్శించారు. తమిళనాడుకు నిధులు ఇవ్వలేదని ప్రాజెక్టులు ప్రకటించలేదని ఆరోపించారు. త్వరలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తుమని సీఎం స్టాలిన్ తెలిపారు.

మంగళవారం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్ పై మండిపడ్డారు. ఈ కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని అన్నారు. విభజన హామీల్లో ఆంధ్రప్రదేశ్ నిధులు కేటాయించిన వారికి.. తెలంగాణ గుర్తు కు రాలేదా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అనేకసార్లు తెలంగాణ పరిస్థితిపై వివరించిన నిధులు కేటాయించలేదని అన్నారు. 

Tags:    

Similar News