కేంద్ర మంత్రి సంజయ్‌ క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడి

నీట్‌ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ క్యాంపు ఆఫీస్‌ను విద్యార్థి, యువజన సంఘాలు ముట్టడించేందుకు యత్నించాయి.

By :  Raju
Update: 2024-06-23 08:47 GMT

నీట్‌ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ క్యాంపు ఆఫీస్‌ను విద్యార్థి, యువజన సంఘాలు ముట్టడించేందుకు యత్నించాయి. ఒక్కసారిగా దూసుకొచ్చిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నీట్‌ పరీక్ష లీకైనా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read - CM అంటే కటింగ్‌ మాస్టరా?: కేటీఆర్‌

నీట్‌ పరీక్షలో అవకతవకల వల్ల దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా దీనిపై మంత్రి సంజయ్ మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం ఈ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News