తెలంగాణలో పలువురు ఐపీఎస్ల బదిలీ
తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సీపీగా మరోసారి సీవీ ఆనంద్కు బాధ్యతలు అప్పగించారు.
By : Vamshi
Update: 2024-09-07 08:40 GMT
తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సీపీగా మరోసారి సీవీ ఆనంద్కు బాధ్యతలు అప్పగించారు. విజిలెన్స్ డీజీగా కోత్తకోట శ్రీనివాస్రెడ్డి, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్కు ప్రభుత్వం నియమించింది. పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా మహేశ్ భగవత్కు, పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం.రమేశ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది