ఏపీలో 10 మంది ఐపీఎస్ల బదిలీ
ఆంధ్రప్రదేశ్లో 10 మంది ఐపీఎస్లను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది.
By : Vamshi
Update: 2024-08-16 15:06 GMT
ఆంధ్రప్రదేశ్లో 10 మంది ఐపీఎస్లను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అనంతపురం ఎస్పీగా జగదీష్, విశాఖ ఏపీఎస్పీ కమాండెంట్గా మురళికృష్ణ, విజయవాడ డీసీపీగా మహేశ్వరరాజు, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్గా సునీల్, గుంతకల్ రైల్వే ఎస్పీగా రాహుల్ మీనా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, చింతూరు ఏఎస్పీగా పంకజ్కుమార్ మీనా, పార్వతీపురం ఎస్డీపీవోగా సురానా అంకిత్లను బదిలీ చేశారు. అలాగే.. ఐపీఎస్ అధికారి సత్య ఏసుబాబును డీజీపీ ఆఫీస్కు బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.