మూడో వన్డేలో భారత్ ఘోర ఓటమి..సిరీస్ లంక కైవసం

శ్రీలంకతో ఆఖరి వన్డేలో భారత్ ఘోరంగా ఓటమి పాలైంది. 110 పరుగుల తేడాతో గెలిచిన లంక సిరీస్ కైవసం చేసుకుంది.

By :  Vamshi
Update: 2024-08-07 15:09 GMT

శ్రీలంకతో ఆఖరి వన్డేలో భారత్ ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 0-2 తేడాతో సిరీస్ లంక కైవసం చేసుకుంది. మూడో వన్డేలో 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ పది వికెట్లు కోల్పోయి 138 పరుగులకే కుప్పకూలింది. రోహిత్‌ శర్మ (35), విరాట్‌ (20), సుందర్‌ (30) ఫర్వాలేదనిపించగా.. గిల్‌ (6), పంత్‌ (6), శ్రేయస్‌ (8), అక్షర్‌ (2), రియాన్‌ (15), దూబె (9) నిరాశపరిచారు. లంక బౌలర్లలో వెల్లలాగె 5.. వాండర్సే, తీక్షణ చెరో 2.. ఫెర్నాండో ఒక వికెట్‌ పడగొట్టారు. 

Tags:    

Similar News