ఎటువంటి లోటు లేదు.. అంతా అభివృద్ధే.. రంగంలో స్వర్ణలత

తెలంగాణలో పాడిపంటలు బాగా పండుతాయని వర్షాలు బాగా కురుస్తాయని అన్నింటిలో అభివృద్ధి ఉంటుందని రంగంలో స్వర్ణలత తెలిపారు.

By :  Vamshi
Update: 2024-07-22 05:01 GMT

ఈసారి తెలంగాణలో పాడిపంటలు బాగా పండుతాయని వర్షాలు బాగా కురుస్తాయని అన్నింటిలో అభివృద్ధి ఉంటుందని రంగంలో స్వర్ణలత తెలిపారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయం వద్ద నిర్వహించిన రంగంలో భవిష్యవాణిని వినిపించారు. ఈ సారి నిర్వహించిన బోనాల పండుగ చాలా సంతృప్తిగా అనిపించిందని చెప్పారు. ప్రజలకు, పశుపక్ష్యాదులకు ఎటువంటి వ్యాధులు, బాధలు రాకుండా చూసుకుంటానని వెల్లడించారు.

హైదరాబాద్‌‌లో బోనాల పండుగ హడా విడి జోరుగా కొనసాగుతోంది. మొదటి రోజు మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు..ప్రశాంతంగా ముగిశాయి. నిన్న తెల్లవారు జామున ప్రభుత్వం తరుపున మొదటి బోనం సమర్పించడంతో ప్రారంభమై అమ్మవారి బోనాల ప్రక్రియ కొనసాగుతోంది. లక్షలాది భక్తుల మొక్కులు, వేలాది బోనాల సమర్పణ తో అంగరంగ వైభవంగా కొనసాగాయి మహంకాళి బోనాలు. పోత రాజుల ఆటపాటలతో ఫలహారం బండి ఊరేగుంపులతో ఈ రోజు తెల్లవారు జామున తొలి రోజు బోనాల సంబరాలు..ముగిశాయి.

Tags:    

Similar News