తెలంగాణ లాసెట్ 2024 ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్ తో పాటు లాసెట్ కన్వీనర్ ఫలితాలను ప్రకటించారు.ఈ ఏడాదికి సంబందించి జున్ 3వ తేదీన టీఎస్ లాసెట్ పరీక్షలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తం 50,684 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 40,268 మంది పరీక్ష హాజరయ్యారు. ఈ ఎగ్జామ్లో 72.66 శాతం క్వాలీపై అయ్యారు. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు మొదటి సెషన్ పరీక్ష నిర్వహించారు.
అలాగే.. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు రెండో సెషన్.. సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్ పరీక్షను నిర్వహించారు. గతేడాదితో పోల్చితే ఈసారి లాసెట్కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ టీఎస్ లాసెట్ పరీక్ష ద్వారా ఎల్ఎల్బీతో పాటు రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఈ పరీక్షను హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.