ఉద్యోగుల సాధారణ బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.జులై 5 - 20 వరకు బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు.
By : Raju
Update: 2024-07-03 13:25 GMT
తెలంగాణలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జులై 5 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ జరగనున్నది.
ప్రభుత్వం సాధారణ బదిలీలకు అనుమతి ఇవ్వడంతో వివిధ శాఖల్లో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఊరట లభించింది. అయితే రాజకీయ ఒత్తిళ్లు, పైరవీలు లేకుండా బదిలీలు ఎంతవరకు పారదర్శకంగా జరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.