తెలంగాణ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా కేఎస్ శ్రీనివాస‌రాజు

వీఆర్‌ఎస్‌ తీసుకున్న ఐఎఎస్ అధికారి శ్రీనివాస రాజును తెలంగాణ సర్కార్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నియమించింది.

By :  Vamshi
Update: 2024-07-01 12:21 GMT

తెలంగాణ ప్రభుత్వానికి కొత్త సలహాదారుగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజ నియమితులయ్యారు. టీటీడీ జేఈవోగా సుదీర్ఘకాలంగా పనిచేసిన శ్రీనివాసరాజు ఇటీవలే వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. . 2001 ఏపీ ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన శ్రీనివాసరాజు 2011లో వైజాగ్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో టీటీడీ జేఈవోగా నియమితులయ్యారు. ఆ తర్వాత జేఈవోగా బాధ్యతలు తీసుకుని 2019 జూన్‌ వరకు ఎనిమిదేళ్లకు పైగా టీటీడీ జేఈవో బాధ్యతల్లో కొనసాగారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల్లో జేఈవోగా విధులు నిర్వహించారు, టీటీడీలో తనదైన ముద్ర వేశారు.

అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయన ఇంటర్‌ కేడర్‌పై తెలంగాణ రాష్ట్రనికి వ‌చ్చారు. తెలంగాణ నాలుగేండ్ల పాటు ర‌హ‌దారులు భ‌వ‌నాల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌ర్తించారు. మార్చి నెలతో డిప్యుటేషన్‌ గడువు ముగియడంతో పొడిగింపునకు క్యాట్‌ను ఆశ్రయించారు. అయితే డిప్యుటేషన్‌ ముగియడంతో నేరుగా ఏపీకి వచ్చి రిపోర్టు చేశారు. గత మే నెలలో ఏపీ సీఎస్‌కు రిపోర్టు చేశారు. కాగా, జూన్ 19న శ్రీనివాసరాజు వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. గత వారం ఆమోదం తెలుపుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియామకం అయ్యారు.

Tags:    

Similar News