తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు రిలీజ్

ఎడ్‌సెట్ 2024 ప్ర‌వేశ ప‌రీక్ష ఫ‌లితాల్లో 96.90 శాతం ఉత్తీర్ణ‌త‌

Byline :  Vamshi
Update: 2024-06-11 11:15 GMT

తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి రిలీజ్ చేశారు. పరీక్షకు హాజరైన 29,463 మంది విద్యార్థుల్లో 28,549 మంది క్వాలిపై అయినట్లు ఆయన తెలిపారు. అందులో4769 మంది పురుషులు 23,780 మంది మహిళలు ఉన్నారు. నాగర్ కర్నూలు చెందిన నవీన్‌కుమార్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా హైదరాబాద్‌కు చెందిన ఆశిత సెకండ్ ర్యాంకు సాధించారు. ఆన్‌లైన్ కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో మే 23వ తేదీన ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించారు. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు 87 శాతం మంది హాజ‌ర‌య్యారు. టీఎస్ ఎడ్‌సెట్‌కు 33,879 మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే వీరికి రెండు సెష‌న్ల‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. సెష‌న్‌-1లో 16,929 మందికి గానూ 14,633 మంది, సెష‌న్-2లో 16,950 మందికి గానూ 14,830 మంది అభ్య‌ర్థులు హాజ‌ర‌య్యారు.

Tags:    

Similar News