తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 27కు సభ వాయిదా

తెలంగాణ శాసనసభ సమావేశాలకు వాయిదా వేస్తున్నాట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు.

By :  Vamshi
Update: 2024-07-25 09:13 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వాయిదా వేస్తున్నాట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. 2024-25 రాష్ట్ర బడ్జెట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన వెంటనే సభను స్పీకర్ వాయిదా వేశారు. ఈ నెల 27న శనివారం తిరిగి సభ ప్రారంభమవుతుందని తెలిపారు. తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిన‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News