విపక్షాలను లక్ష్యంగా చేసుకుంటే ఒంటరి అవుతారు: స్టాలిన్
పాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటే ఒంటరి అవుతారని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని మోడీని హెచ్చరించారు.
By : Raju
Update: 2024-07-25 02:49 GMT
పాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటే ఒంటరి అవుతారని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని మోడీని హెచ్చరించారు. బడ్జెట్లో బీజేపీ యేతర అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిందన్న ఆరోపణల నేపథ్యంలో స్టాలిన్ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు.
తాజా బడ్జెట్ బీజేపీ పాలనను కాపాడుతుంది కానీ దేశాన్నిరక్షించదని చెప్పారు. మిమ్మల్ని ఓడించినవారిపై ప్రతీకారం తీర్చుకోవద్దని వ్యాఖ్యానించారు. సొంత ఇష్టాయిష్టాలపై పరిపాలిస్తే ఒంటరిగా మిగిలిపోతారని హెచ్చరించారు. చెన్నై మెట్రో రైల్ రెండో దశ పనులకు, కోయంబత్తూర్లో మౌలిక సదుపాయాలకు, చెన్నై వరద ప్రాంతాల పునరుద్ధరణకు నిధులు కేటాయించలేదని వెల్లడించారు. కేంద్రం నుంచి రూ. 36 వేల కోట్లు రావాలని, ఇప్పటివరకు రూ. 270 కోట్లు మాత్రమే ఇచ్చారని వివరించారు.