శ్రీలంక ముందు స్వల్ప లక్ష్యం.. రాణించిన గిల్, పరాగ్
మూడో టీ20లో మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది
By : Vamshi
Update: 2024-07-30 16:19 GMT
మూడో టీ20లో మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఒకదశలో పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయిన జట్టును ఓపెనర్ శుభ్మన్ గిల్(39) ఆదుకున్నాడు. ఐపీఎల్ షో మ్యాన్ రియాన్ పరాగ్(26) అండగా ఆరో వికెట్కు 54 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఖర్లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్(25) మెరుపు బ్యాటింగ్తో జట్టు స్కోర్ 130 దాటించాడు. దాంతో, టీమిండియా ఆతిథ్య జట్టుకు 138 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.