సాయిచంద్ తెలంగాణ ప్రజలందరి హృదయాల్లో ఉన్నాడు : హరీష్ రావు

తెలంగాణ ఉద్యమానికి సాయిచంద్ చేసిన సేవలు వెలకట్టలేమని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు

By :  Vamshi
Update: 2024-06-29 09:49 GMT

తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ తొలి వర్థంతి కార్యక్రమం రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలో నిర్వహించారు. సాయి మన నుంచి దూరంమై అప్పుడే ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నాకు తమ్ముడిగా, కుటుంబసభ్యుడిగా నాతో అన్ని కష్టసుఖాలు పంచుకునేవాడని హరీష్ అన్నారు. ఉద్యమంలో సాయిచంద్ తో కలసి తెలంగాణలో వేలకిలోమీటర్లు ప్రయాణించాం.

అతనితో అంత ఆత్మీయ అనుబంధని గుర్తుచేసుకున్నారు. సాయిచంద్ భౌతికంగా మన మధ్యలేకపోయినా తెలంగాణ ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడని పేర్కొన్నారు. రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా అని పాడుతుంటే లక్షల మంది కన్నీళ్లు పెట్టునేవాళ్లు. సాయి బతికి ఉంటే తప్పకుండా చట్టసభలో అడుపెట్టేవాడని హరీష్ రావు అన్నారు. సాయిచంద్ భార్యాపిల్లలకు, తల్లిదండ్రులకు బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.

Tags:    

Similar News