ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా..15 మందికి గాయాలు
ఏపీ శ్రీసత్య సాయి జిల్లా గుమ్మలకుంట దగ్గర పల్లె వెలుగు బస్సు బోల్త పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
By : Vamshi
Update: 2024-09-07 07:35 GMT
ఏపీ శ్రీసత్య సాయి జిల్లా గుమ్మలకుంట దగ్గర పల్లె వెలుగు బస్సు బోల్త పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. నల్లమాడ నుంచి అనంతపురంకు వస్తున్న సమయంలో గుమ్మలకుంట సమీపంలో పల్లె వెలుగు బస్సు బోల్తా కొట్టింది. అయితే.. ఈ ఘటన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు.
అయితే.. ఇందులో ఉన్న కొంత మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయపడ్డారు. వారికి ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన పలువురి ప్రయాణికులను ఆస్పత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు