పరిపాలన ఎలా చేయాలో రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి : మోత్కుపల్లి

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పింది తానేనని... కానీ మొట్టమొదట ఆయన తమనే రోడ్డున పడేశారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.

Byline :  Vamshi
Update: 2024-06-07 10:13 GMT

రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని పస్ట్ చెప్పిన తననే మొదటగా రోడ్డున పడేశారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. 6 గంటలు సచివాలయంలో కూర్చున్నా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. 6 సార్లు గెలిచిన నాకు ఇంత అమానం ఎక్కడ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన ఎలా చేయాలో రేవంత్ నేర్చుకోవాలని ఆయన అన్నారు. మాదిగలకు రేవంత్ రెడ్డి ఒక్క సీటూ ఇవ్వలేదని మండిపడ్డారు.

పాలన ఎలా చేయాలో రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని హితవు పలికారు. తాను ఆరు గంటలు సచివాలయంలో కూర్చున్నప్పటికీ ముఖ్యమంత్రి అపాయింటుమెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదన్నారు. విలువలు లేని కడియం శ్రీహరిని బీఆర్ఎస్ నమ్మి మోసపోయిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News