రంగనాథ్ హైడ్రా కమిషనరా.. లేక రాజకీయ నాయకుడా ? : మహేశ్వర్ రెడ్డి

హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగనాథ్ హైడ్రా కమిషనరా..? లేక రాజకీయ నాయకుడా..? అని ప్రశ్నించారు.

By :  Vamshi
Update: 2024-08-29 12:36 GMT

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ప్రజాసేవపై అంత మోజు ఉంటే ఖాకీ బట్టలు వదిలేసి.. ఖద్దరు బట్టలు వేసుకోవాలని షాకింగ్ కామెంట్ చేశారు. రంగనాథ్ హైడ్రా కమిషనరా..? లేక రాజకీయ నాయకుడా..? అని ప్రశ్నించారు. కేవలం హిందువుల బిల్డింగ్‌లని మాత్రమే కూల్చుతారా..? అంటూ మండిపడ్డారు. రంగనాథ్‌కి పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అని విమర్శించారు.

ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూలు ఇస్తూ తనను తాను ప్రమోట్ చేసుకుంటున్నారని.. రంగనాథ్ తన మీద కూడా కామెంట్ చేశారని మహేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాథ్‌కి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏమైన ఎమ్మెల్సీ పదవి ఇస్తాని చెప్పారా అని ఆయన ప్రశ్నించారు. ఓవైసీ బిల్డింగ్ లో స్టూడెంట్స్ ఉన్నారని… ఇప్పుడు కూల్చం అని రంగనాథ్ అంటున్నారని.. ఓవైసీ కాలేజీకి వర్తించిన నిబంధనలు పల్లా, మర్రి రాజశేఖర్‌రెడ్డికి వర్తించవా అని ప్రశ్నించారు. కాలేజీ కూల్చివేతకు ఒవైసీకి 6 నెలల సమయం ఇచ్చారని.. మరి ఎన్-కన్వెన్షన్‌కు ఎందుకు సమయం ఇవ్వలేదో చెప్పాలన్నారు. ఓల్డ్ సిటీకి వెళ్లే దమ్ము రేవంత్ ప్రభుత్వానికి లేదని.. టార్గెట్ చేసి నిర్మాణాలను కూలుస్తున్నారని మహేశ్వరరెడ్డి ఆక్షేపించారు.

Tags:    

Similar News