అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు

తెలంగాణ సర్కారు నిర్ణయం.. ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు

Byline :  Vamshi
Update: 2024-06-08 05:52 GMT

రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం ఢీల్లిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడ నుంచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికు ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీసు కమీషనర్‌కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఓ మీడియా దిగ్గజానికి అధికారిక లాంఛనాలతో నిర్వహించనుండటం దేశంలో ఇదే తొలిసారి.

గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నానక్ రామ్ గూడలోని ఓ ప్రముఖ ఆసుప‌త్రికి తరలించారు. వెంటిలేటర్‌పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. రామోజీరావు మీడియాతోపాటు అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనాడు సంస్థలు, రామోజీ ఫిల్మ్‌ సిటీ, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌, ప్రియా ఫుడ్స్‌, ఈటీవీ వంటి వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీరావు నడిపిస్తున్నారు. తెలుగు మీడియాలో ప్రధానమైన ఈనాడు సంస్థ ఆయన ఆధ్వర్యంలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News