లావణ్యపై రాజ్ తరుణ్ పేరెంట్స్ ఫిర్యాదు

లావణ్య వల్ల తమకు ప్రాణహాని హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

By :  Vamshi
Update: 2024-08-01 16:08 GMT

తెలంగాణ హైకోర్టును హీరో రాజ్ తరుణ్ ఆశ్రయించారు. లావణ్య కేసులో ముందుస్తున్న బెయిల్‌పై హైకోర్టు ఇవాళ విచారించింది. పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ని హైకోర్టు ఆదేశించారు. తుదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసాడని రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసిన విషయం అందరికి తెలిసిందే. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మీ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో లావణ్య పై ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి మాదాపూర్ కాకతీయ హిల్స్ లో నివాసం ఉంటున్న హీరో రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లి లావణ్య గొడవ చేసిందని, తలుపులను గట్టిగా బాదుతూ డోర్లు తెరవాలంటూ నానా హంగామా సృష్టించిందని, న్యూసెన్స్ చేసిందని, తమపై దాడికి ప్రయత్నించిందని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని, లావణ్య వల్ల తమకు ప్రాణహాని ఉందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Tags:    

Similar News