తెలంగాణలో రైల్వేకు నిధులిచ్చాం..లోక్ సభలో నిర్మలా కామెంట్స్

తెలంగాణ, తమిళనాడు, కేరళ సహా వివిధ రాష్ట్రాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని విపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ఖండించారు

By :  Vamshi
Update: 2024-07-30 13:09 GMT

దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని విపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో స్పందించారు. తాము సబ్‌కా సాథ్.. సబ్ కా వికాస్ స్పూర్తితో బడ్జెట్ రూపొందించామని నిర్మలా సీతారామన్ అన్నారు. తెలంగాణ సహా ఏ రాష్ట్రానికి ఏం ఇచ్చామో వివరించారు. దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపులు జరపలేదనడాన్ని ఖండించారు. తెలంగాణలో భద్రాచలం, డోర్నకల్ సెక్షన్లలో రైల్వే పనులకు మొత్తం రూ.12,334 కోట్ల నిధులు ఇచ్చామన్నారు. ఏపీ, తెలంగాణలో మోటుమర్రి-విష్ణుపురం సెక్షన్లలో రైల్వే డబ్లింగ్ పనులకు, మడికేర్, మేడ్చల్, మహబూబ్ నగర్, డోన్ మార్గంలో డబ్లింగ్ పనులకు, భద్రాచలం, డోర్నకల్ సెక్షన్లలో రైల్వే పనులకు మొత్తం రూ.12,334 కోట్ల నిధులు ఇచ్చామన్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లో రూ.1900 కోట్లతో బ్క్ డ్రగ్ పార్కులు ప్రకటించినట్లు చెప్పారు. కేరళ, బెంగాల్ తదితర రాష్ట్రాలకు కూడా నిధులు కేటాయించామన్నారు. తాము ఏ రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చలేదని పేర్కొన్నారు. తమ నినాదం ఇండియా ఫస్ట్ అన్నారు. కమ్యూనిస్ట్ రాష్ట్రం కేరళకు కూడా నిధులు ఇచ్చామన్నారు. 2009-10 బడ్జెట్‌లో బీహార్, యూపీకి నాటి కాంగ్రెస్ సర్కార్ అధికంగా నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఇప్పుడు బీహార్, ఏపీపై ఆరోపణలు చేస్తున్నవారు దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. 2009-10 బడ్జెట్‌లో 26 రాష్ట్రాల ప్రస్తావన నాటి బడ్జెట్‌లో లేదని విమర్శించారు. 2010-11 బడ్జెట్‌లో 11 రాష్ట్రాలను, 2011-12లో 15 రాష్ట్రాలను, 2012-13లో 16 రాష్ట్రాలను, 2013-14లో 10 రాష్ట్రాలను విస్మరించారన్నారు. నాడు విస్మరించిన వారే ఈరోజు తమను విమర్శించడం విడ్డూరమన్నారు. బడ్జెట్ కేటాయింపులపై కేంద్రమంత్రులు రాష్ట్రాల ప్రజలకు వివరిస్తున్నారన్నారు.

Tags:    

Similar News