త్వరలో భారత్ డోజో యాత్ర..ఎక్స్ వేదికగా రాహుల్ ప్రకటన
త్వరలో భారత్ డోజో యాత్ర రాబోతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ కీలక ప్రకటన చేశారు.
త్వరలో భారత్ డోజో యాత్ర రాబోతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ కీలక ప్రకటన చేశారు. నేడు జాతీయ క్రీడా దినోత్సవం ఈ సందర్భంగా గతంలో జోడో యాత్ర’ సమయంలో తమ శిబిరాల వద్ద జరిగిన జియు-జిట్సు ప్రాక్టీస్ సెషన్కు సంబంధించిన వీడియోను ట్వీట్టర్ వేదికగా రాహుల్ పంచుకున్నారు.
ఫిట్గా ఉండేందుకు ప్రతి రోజూ జియు-జిట్సు ఆర్ట్స్ను ప్రాక్టీస్ చేసేవాళ్లు. జియు-జిట్సు అనేది బ్రెజిల్ మార్షల్ ఆర్ట్. జోడో యాత్రలో రోజూ సాయంత్రం శిబిరంలో మార్షల్ ఆర్ట్ జియు-జిట్సు సాధన చేసేవారు. నేడు స్పోర్ట్స్ డే సందర్భంగా ఆ అనుభవాలను తాజాగా వీడియో రూపంలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఇదే ట్వీట్లో త్వరలో ‘భారత్ డోజో యాత్ర’ రాబోతోందంటూ రాహుల్ ప్రకటించారు. ‘డోజో’ అంటే మార్షల్ ఆర్ట్స్లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు.