బీచ్‌లో రాష్ట్రపతి మార్నింగ్ వాక్

ఒడిశా పూరి సముద్ర తీరంలో రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము మార్నింక్ వాకింగ్ చేశారు

By :  Vamshi
Update: 2024-07-08 07:37 GMT

భారత రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ఒడిశాలోని పూరి సముద్ర తీరంలో రాష్ట్రపతి మార్నింగ్ వాక్ చేశారు. తీరం వెంబడి నడుస్తున్న అలల సవ్వడి, చల్లని గాలి, సముద్రపు హోరు ధ్యానం చేస్తున్న అనుభూతిని కలించాయిని ఎక్ప్‌లో పోస్ట్ చేశారు. ఈ రోజు సముద్ర తీరం వెంట నడుస్తుంటే, పరిసరాలతో ఒక కలయిక అనుభవించాను అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

నాలుగు రోజుల ఒడిశా పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆ రాష్ట్రానికి చేరుకున్నారు. ఉదయగిరి గుహలను సందర్శించి, బిభూతి కనుంగో కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, ఉత్కల్ యూనివర్శిటీ ఆఫ్ కల్చర్ విద్యార్థులతో సంభాషించనున్నారు. మరుసటి రోజు భువనేశ్వర్ సమీపంలోని హరిదామడ గ్రామంలో బ్రహ్మ కుమారీల డివైన్ రిట్రీట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు.

Tags:    

Similar News