యూపీఎస్సీ నూతన ఛైర్‌ పర్సన్‌గా ప్రీతి సుదాన్‌

యూపీఎస్సీ నూతన ఛైర్‌ పర్సన్‌గా ప్రీతి సుదాన్‌ నియమితులయ్యారు. ఆగస్టు 1న ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.

By :  Raju
Update: 2024-07-31 05:57 GMT

యూపీఎస్సీ నూతన ఛైర్‌ పర్సన్‌గా ప్రీతి సుదాన్‌ నియమితులయ్యారు. ఆగస్టు 1న ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల వ్యక్తిగత కారణాలతో మనోజ్‌ సోనీ బాధ్యతల నుంచి తప్పుకుని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ప్రీతీ సుదాన్ 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి.ఆమె పదవీకాలం ఏప్రిల్ 29, 2025 వరకు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు కొనసాగుతారు. ఆమె కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు. 

ఐదేళ్ల పదవీ కాలం ఉండగానే మనోజ్‌ సోనీ యూపీఎస్సీ ఛైర్మన్‌ పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ట్రైనీ ఐఏఎస్‌ అధికారి పూజా ఖేడ్కర్‌ వ్యవహారంపై తీవ్ర దుమారం రేపుతున్న సమయంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే మనోజ్‌ సోనీ రాజీనామాకు దానితో సంబంధం లేదని వ్యక్తిగత కారణాలతోనే ఆయన తప్పుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

Tags:    

Similar News