మళ్లీ ప్రారంభమైన ప్రజావాణి...క్యూకట్టిన ప్రజలు

Update: 2024-06-07 05:35 GMT

ప్రజా వాణి కార్యక్రమం నేడు పున ప్రారంభమైంది. ఎన్నికల కోడ్ వల్ల తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే నిన్నటితో ఎలక్షన్ కోడ్ ముగియడంతో నేటి నుంచి ప్రజా వాణి అర్జీల స్వీకరణ గతంలో మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమం నిర్వహించేవారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రభుత్వ దృష్టి తీసుకురవాచ్చన్నారు.

మళ్లీ ప్రారంభమైన ప్రజావాణి...క్యూకట్టిన ప్రజలుప్రజావాణిలో వచ్చిన వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వర పరిష్కారాలు చూపాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కాగా, ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రతిరోజూ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. తాను కూడా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తానని తెలిపారు. అయితే మొదటి రోజు మినహా ఆయన ఎప్పుడూ ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం గమనార్హం. అదేవిధంగా రోజూ నిర్వహిస్తామన్న కార్యక్రమాన్ని వారంలో రెండు రోజులకు కుదించారు.

Tags:    

Similar News