విదేశీ పర్యటన ముగించుకొని ఢిల్లీకి చేరిన ప్రధాని

రెండు దేశాల విదేశీ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ శనివారం ఉదయ ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అడుగుపెట్టారు. మొదట పోలాండ్‌లో ప్రధాని పర్యటించారు

By :  Vamshi
Update: 2024-08-24 10:50 GMT

రెండు దేశాల విదేశీ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ శనివారం ఉదయ ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అడుగుపెట్టారు. మొదట పొలండ్‌లో ప్రధాని పర్యటించారు. గత 45 ఏళ్లలో పోలాండ్ పర్యటించిన మొదటి ప్రధానిగా మోదీ నిలిచారు. ఆ తర్వాత రైలు మార్గంలో ఉక్రెయిన్‌కు వెళ్లి జెలెన్ స్కీని ఓదార్చారు. 'ఒయాసిస్ ఆఫ్ పీస్' పార్క్‌లో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. రష్యాతో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు జెలెన్‌స్కీతో కలిసి నివాళులు అర్పించారు.

బాధితులకు నివాళిగా ఒక ఆటబొమ్మను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, జెలెన్‌స్కీ పాల్గొన్నారు. పలు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. వ్యవసాయ, మెడికల్ ప్రాడెక్ట్ రెగ్యులేషన్, హ్యుమనటేరియన్ అసిస్టెన్స్, సాంస్కృతిక మార్పిడి తదితర రంగాల్లో సహకారానికి నిర్ణయించారు. ఉక్రెయిన్-రష్యా సమస్యలపై పరస్పరం చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని, ఇందుకు ఎలాంటి సహకారం అందించేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని జెలెన్‌స్కీతో జరిపిన సంభాషణల్లో మోదీ భరోసా కల్పించారు.

Tags:    

Similar News