ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు
భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలే : కేటీఆర్
By : Naveen Kamera
Update: 2024-09-01 07:45 GMT
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని, వారిని ఇండ్ల నుంచి బయటకు వెళ్లనివ్వొద్దని సూచించారు. తాత్కాలిక నిర్మాణాలు, పాడుబడ్డ భవనాలకు దూరంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండి, సహాయ చర్యల్లో పాల్గొనాలని కోరారు. లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ అండగా నిలువాలని సూచించారు.