అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పెమ ఖండూ ప్రమాణ స్వీకారం
సీఎంగా ఖండూ మూడోసారి బాధ్యతలు
అరుణాచల్ ప్రదేశ్లో మరోసారి బీజేపీ సర్కార్ కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెమా ఖండూ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కేటీ పర్నాయక్ ఈ రోజు ఖండూ చేత ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46 స్థానాల్లో విజయం సాధించింది. నేనషల్పీపుల్స్పార్టీ(ఎన్పీఈపీ) ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్సీపీ మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి.
మొత్తం 60 స్థానాల్లో ఎన్నికలకు ముందే 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వారిలో అరుణాచల్ప్రదేశ్సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ ఉన్నారు. మరోవైపు, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తన రెండు స్థానాలను రాష్ట్రం నుంచి నిలబెట్టుకుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు.