పారిస్ ఒలింపిక్స్‌ : క్వార్టర్స్‌కు చేరిన భారత మహిళ టేబుల్ టెన్నిస్‌ జట్టు

పారిస్ ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులు అద‌రగొట్టారు. వ్య‌క్తిగ‌త ఈవెంట్‌లో నిరాశ‌ప‌రిచిన మ‌నికా బ‌త్రా, ఆకుల శ్రీ‌జ, అర్చ‌నా కామ‌త్‌లు టీమ్‌గా హిట్ కొట్టారు.టేబుల్ టెన్నిస్‌ టీమ్ ఈవెంట్‌లో క్వార్టర్స్‌కు భారత్ చేరింది.

By :  Vamshi
Update: 2024-08-05 11:43 GMT

పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళల టెబుల్ టెన్నిస్ టీమ్ క్వార్టర్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 16వ రౌండ్‌లో రొమానియాను 3-2 తేడాతో ఓడించింది. ఒలింపిక్స్ టీటీలో ఇండియ ఉమెన్స్ టీమ్ క్వార్టర్స్ చేరుకోవడం ఇదే తొలిసారి. క్వార్టర్స్‌లో అమెరికా లేదా జర్మనీతో పోటీ పడే ఛాన్స్ ఉంది. వ్య‌క్తిగ‌త ఈవెంట్‌లో నిరాశ‌ప‌రిచిన మ‌నికా బ‌త్రా, ఆకుల శ్రీ‌జ‌, అర్చ‌నా కామ‌త్‌ లు టీమ్‌గా హిట్ కొట్టారు. ప‌తకం ఆశ‌లు రేపుతూ ఈ త్ర‌యం క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది.

సోమ‌వారం జ‌రిగిన 16వ రౌండ్‌లో శ్రీ‌జ‌, బత్రా, అర్చ‌న బృందం రొమేనియా జ‌ట్టును చిత్తు చేసింది. తొలుత అర్చ‌నా కామ‌త్ రొమేనియా స్టార్ అడినా డియాకొనుకు చెక్ పెట్టింది. అనంత‌రం శ్రీ‌జ సైతం ప‌ట్టుద‌ల‌గా ఆడి ఎలిజ‌బెట స‌మ‌ర‌ను ఓడించింది. దాంతో, భార‌త జ‌ట్టు 3-0తో ఆధిక్యం సాధించింది. ఆ త‌ర్వాత మ‌నికా బ‌త్రా వ‌రుస‌గా రెండు గేమ్‌లు గెలిచింది. అడియాపై 11-5, 11-9, 11-9తో అద‌ర‌గొట్టింది. దాంతో, భార‌త త్ర‌యం క్వార్ట‌ర్ ఫైన‌ల్లో అడుగుపెట్టింది. 

Tags:    

Similar News