టీడీపీ ఏపీ నూతన బాస్‌గా పల్లా శ్రీనివాస్‌రావు !

ప్ర‌స్తుత అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడుకు మంత్రిగా బాధ్యతలు

Byline :  Vamshi
Update: 2024-06-14 10:46 GMT

ఏపీ టీడీపీ కొత్త‌ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్‌రావును నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడుకు చంద్రబాబు కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రిగా నియమించారు. దీంతో ఆయన టీడీపీ వ్యవహారాలపై పూర్తిస్ధాయిలో ఫోకస్ పెట్టే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు స్ధానంలో మరో సీనియర్ నేతకు అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించే యోచనలో చంద్రబాబు ఉన్నారు.

గాజువాక నుంచి గెలిచిన టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాసరావు పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. గాజువాక ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో పల్లా శ్రీనివాస్‌ గెలుపొందారు. వైసీపీ అభ్య‌ర్థి గుడివాడ అమ‌ర్‌నాథ్‌పై ఆయ‌న ఏకంగా 95, 235 ఓట్లతో మెజారిటీతో గెలిచారు. శ్రీనివాస్ బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News