వైసీపీ కార్యాలయానికి నోటీసులు
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయనికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. తెలుగు దేశం రాష్ట్ర కార్యాలయంపై దాడి రోజు సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
By : Vamshi
Update: 2024-08-21 09:54 GMT
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయనికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. తెలుగు దేశం రాష్ట్ర కార్యాలయంపై దాడి రోజు సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2021 అక్టోబర్ 19 నాటి సీసీ ఫుటేజ్ ను సమర్పించాలని నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. దాడి రోజు వైసీపీ ఆఫీస్ నుంచి ఎవరెవరు బయల్దేరారనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే ఇదే కేసులో వైసీపీ నేత దేవినేని అవినాశ్కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుణదలలోని ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. తాము చెప్పిన రోజు విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపారు.