మర్రి రాజశేఖర్రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు
బఫర్ జోన్ , ఎఫ్టీఎల్ పరిధిలో ఆ నిర్మాణాలు ఉన్నాయంటున్న అధికారులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిన్న దామెరచెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని తాఖీదులు ఇచ్చారు.దుండిగల్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీకి, మర్రి లక్ష్మారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి నోటీసులు ఇచ్చారు. ఈ రెండు కాలేజీలు చిన్నదామెరచెరువుకు సంబంధించిన బఫర్ జోన్ , ఎఫ్టీఎల్ పరిధిలో ఆ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ రెండు కూడా అక్రమంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి కాబట్టి తొలిగించాలని ఇటీవల దుండిగల్ తాహశీల్దార్ కార్యాలయం నుంచి రెవెన్యూ అధికారులు కాలేజీ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. వీటిపై సర్వేచేసిన అధికారులు, వాటి మ్యాపులను, పూర్తి వివరాలను సేకరించిన తర్వాత ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై కాలేజీ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.