ఓటుకు నోటు కేసు: విచారణ బదిలీ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

స్వతంత్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపిన ధర్మాసనం

By :  Raju
Update: 2024-08-29 07:19 GMT

ఓటుకు నోటు కేసు ట్రయల్‌ బదిలీ చేయాలన్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని ధర్మాసనం పేర్కొన్నది. ఈ మేరకు పిటిషన్‌ను రద్దు చేసింది.ఓటుకు నోటు కేసు ట్రయల్‌ బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

కేసులో నిందితుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారని, దర్యాప్తు సంస్థ ఏసీబీ చూసే హోంశాఖ కూడా ఆయన వద్దే ఉన్నదని జగదీశ్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. అందువల్ల కేసు ట్రయల్‌పై పూర్తి అనుమానాలున్నాయని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్‌లో జరిగిన ర్యాలీల్లో పలుమార్లు పోలీసులపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారని న్యాయవాది తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే మన న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్లే అవుతుందని వ్యాఖ్యానించింది.

సీఎంగా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చూస్తేనే కేసుపై ప్రభావం ఎలా ఉన్నదో తెలుస్తుందని, ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్‌లో కూడా వైఖరి మారిందని జగదీశ్‌రెడ్డి న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాంటప్పుడు స్వతంత్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఏర్పాటు చేస్తామని ధర్మాసనం తెలిపింది. పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తామని, మాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉన్నదని ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags:    

Similar News