ఎనిమిదేళ్లుగా ఏ పదవి లేదు..వీహెచ్ షాకింగ్ కామెంట్స్

కాంగ్రెస్ పార్టీలో తనకు ఎనిమిదేళ్లుగా ఒక్క పదవీ ఇవ్వలేదని వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు

By :  Vamshi
Update: 2024-07-10 09:36 GMT

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనకు ఎనిమిదేళ్లుగా ఒక్క పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని పార్టీ అధిష్ఠానాన్ని వీహెచ్ కోరారు. గత లోక్ సభ ఎన్నికల్లో తనకు సికింద్రాబాద్ టిక్కెట్ ఇస్తే గెలిచేవాడినన్నారు. టిక్కెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు వీహెచ్ శుభాకాంక్షలు తెలిపారు.

టీమిండియా ఆటగాడు మహమ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం, ఉద్యోగం ఇస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మన దేశంలో క్రికెట్‌కు మంచి క్రేజ్ ఉందన్నారు. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌లో తప్ప ఎక్కడా క్రికెట్ స్టేడియం లేదన్నారు. కానీ ఏపీలో 12 ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో స్టేడియం నిర్మాణానికి పన్నెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సీఎం రేవంత్‌ని కోరారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో క్రీడలకు ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించాలని కోరారు.

Tags:    

Similar News