బాధ్యతల నుంచి తప్పుకున్న నర్సింహారెడ్డి

విద్యుత్‌ కమిషన్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి జస్టిస్‌ నర్సింహారెడ్డి తప్పుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

By :  Raju
Update: 2024-07-16 08:58 GMT

విద్యుత్‌ కమిషన్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి జస్టిస్‌ నర్సింహారెడ్డి తప్పుకున్నారు. తెలంగాణలో విద్యుత్‌ కమిషన్‌ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.

కమిషన్‌ ఛైర్మన్‌ మార్చాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే జస్టిస్ నర్సింహారెడ్డి తనకు తానుగా వైదొలిగారు. 




 


Tags:    

Similar News