నాగేందర్‌.. నీ భూకబ్జాలన్నీ బైటికి తీస్తాం: పాడి కౌశిక్‌రెడ్డి

కేసీఆర్‌ దయ వల్ల రెండు సార్లు గెలిచిన దానం నాగేందర్‌కు సిగ్గు, శరం, లజ్జ ఉన్నదా? అని హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.

By :  Raju
Update: 2024-07-14 07:15 GMT

బీఆర్‌ఎస్‌ టికెట్‌ గెలిచి అమ్ముడుపోయి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్ స్థాయి మర్చి మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని.. ఆయన నిన్న కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ..

2018 జూన్ 22నాడు బీఆర్ఎస్ లో చేరినప్పుడు మీరు చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ అన్యాయం చేస్తున్నదని బీఆర్ ఎస్ లో చేరావు. కేసీఆర్‌ దయ వల్ల రెండు సార్లు ఎంఎల్ఏ గా గెలిచావు. అలాంటి మీకు సిగ్గు, శరం, లజ్జ ఉన్నదా? అని ఘాటుగా స్పందించారు. బీడీలు అమ్ముకునే దానం నాగేందర్ ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడు అని ప్రశ్నించాడు. మీ ఇంటి చుట్టూ, హైదరాబాద్ లో చేసిన కబ్జాలన్ని మా దృష్టికి వచ్చాయి. అన్నింటినీ బయటికి తీస్తామని తెలిపారు.

పార్టీ మారిన నేతలందరూ ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాల్‌ విసిరారు. అమ్ముడుపోయిన దానం నాగేందర్ నీతులు చెప్తున్నవా అని మండిపడ్డారు.

Tags:    

Similar News