మహమ్మద్ సిరాజ్కు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం : సీఎం
క్రికెటర్ మహమ్మద్ సిరాజ్కు ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ పరిసరాల్లో ఇంటి స్థలం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
టీమ్ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. టీ-20 వరల్డ్ కప్ గెలుచుకున్న అనంతరం హైదరాబాద్కు చేరుకున్న సిరాజ్ మంగళవారం ఉదయం సీఎంని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, సిరాజ్ను ఘనంగా సన్మానించారు. మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్లో తన అద్భుతమైన ప్రతిభను చూపుతున్నాడు.
అందుకే ఈ రోజు అత్యున్నత స్థాయి క్రికెటర్లలో ఒకడుగా పేరు సంపాదించుకున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. మహమ్మద్ సిరాజ్కు హైదరాబాద్ నగరంలో ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా క్రికెటర్కు ఇంటి స్థలంపై ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇంటి స్థలం గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.