బాధిత మహిళకు మంత్రి జూపల్లి పరామర్శ

మొలచింతపల్లిలో దాడికి గురైన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు.తక్షణ సాయంగా రూ. 2 లక్షలు, ప్రభుత్వం తరఫున కొంత భూమి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు

By :  Raju
Update: 2024-06-22 07:45 GMT

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతపల్లిలో దాడికి గురైన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించి ఆరోగ్యపరిస్థతిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆమెకు అండగా ఉంటుందన్నారు. తక్షణ సాయంగా రూ. 2 లక్షలు,ప్రభుత్వం తరఫున కొంత భూమి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈశ్వరమ్మ పిల్లలను రెసిడెన్షియల్‌ పాఠశాలలో చేర్పిస్తామని తెలిపారు. ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించిన వారికి చట్టపరంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈశ్వరమ్మ, ఈదన్న దంపతుల భూమిని కౌలుకు తీసుకున్న నిందితుడు వెంకటేశ్‌ ఆమెను అక్రమంగా నిర్బంధించి, లైంగిక దాడికి పాల్పడి చిత్రహింసలకు గురిచేశాడు. ఆమెపై పాశవికంగా దాడి చేయడంతో అపస్మారస్థితిలోకి వెళ్లింది. విషయం తెలసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈశ్వరమ్మను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News